భక్తులకు అందుబాటులో స్వామివారి రాగి నాణేలు

ABN , First Publish Date - 2022-08-16T06:25:27+05:30 IST

వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి ప్రతిమలతో కూడిన రాగి నాణేలను ఆలయ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఐదు గ్రాముల రాగితో రాజరాజేశ్వరస్వామి, నందీశ్వర ప్రతిమలతో కూడిన నాణేలను ఆలయ ఈవో ఎల్‌.రమాదేవి సోమవారం విడుదల చేశారు.

భక్తులకు అందుబాటులో స్వామివారి రాగి నాణేలు
కాయిన్‌ కొనుగోలు చేస్తున్న ఈవో

వేములవాడ, ఆగస్టు 15: వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి ప్రతిమలతో కూడిన రాగి నాణేలను ఆలయ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఐదు గ్రాముల రాగితో  రాజరాజేశ్వరస్వామి,  నందీశ్వర ప్రతిమలతో కూడిన నాణేలను ఆలయ ఈవో ఎల్‌.రమాదేవి సోమవారం విడుదల చేశారు. తొలి నాణేన్ని ఆలయ ఏఈవో ప్రతాప నవీన్‌ చేతుల మీదుగా ఈవో రమాదేవి అందుకున్నారు. ఒక్కో నాణేన్ని 70 రూపాయల చొప్పున ఆలయ ప్రచార శాఖలో కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌, అర్చకులు, ఆలయ అధికారులు  పాల్గొన్నారు.


Updated Date - 2022-08-16T06:25:27+05:30 IST