‘సహకార’ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
ABN , First Publish Date - 2022-07-03T06:06:11+05:30 IST
సహకార సంఘం సేవలను రైతులు సద్వినియో గం చేసుకోవాలని జిల్లా సహకార సంఘం బ్యాంకు మేనేజర్ షేక్ అలీమోద్దీన్ కోరారు.
సూర్యాపేట టౌన్/ కోదాడటౌన్/ చిలుకూరు/ మునగాల రూరల్/ కోదాడ రూరల్, జూలై 2: సహకార సంఘం సేవలను రైతులు సద్వినియో గం చేసుకోవాలని జిల్లా సహకార సంఘం బ్యాంకు మేనేజర్ షేక్ అలీమోద్దీన్ కోరారు. జిల్లాకేంద్రంలోని సహకార సంఘం ఆవరణలో సహకార దినోత్సవం, సహకార సంస్థ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తైన సందర్భం గా సహకార జెండాను శనివారం ఎగురవేసి మాట్లాడారు. రైతులకు, కోళ్ల పెంపకం, పాడిపరిశ్రమ, ట్రాక్టర్ల కొనుగోళ్లకు బ్యాంకు ద్వారా దీర్ఘకాలిక రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకు చైర్మన్ శ్రీధర్రెడ్డి, జయన్న, సృజన, రంజిత్, మానస, రజిత పాల్గొన్నారు. కోదాడలోని పీఏసీఎస్ కార్యాలయ ఆవరణలో చైర్మన్ ఆవుల రామారావు జెండా ఎగు రవేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ర్టార్ ఇందిర, వైస్ చైర్మన్ నరేష్, టీఈవో మంద వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు కమతం వెంకటయ్య, ఓరుగంటి శ్రీని వాస్రెడ్డి, సోమపంగు పార్వతి, బాబు, చంద్రమౌళి, ప్రభాకర్రావు, సీతారా మయ్య పాల్గొన్నారు. చిలుకూరులోని పీఏసీఎస్ ఆవరణలో చైర్మన్ అల్స కాని జనార్ధన్ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఈవో లక్ష్మీనారా యణ, సంఘ డైరెక్టర్లు కస్తూరి సైదులు, కొడారు రాంబాబు, కొండా సోమ య్య, రాయబారపు లక్ష్మయ్య, గుగులోతు లక్ష్మయ్య పాల్గొన్నారు. మునగాల మండలంలోని కొక్కిరేణి పీఏసీఎస్లో చైర్మన్ చందా చంద్రయ్య జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో డైరెక్టర్లు టి. వీరరా ఘవరెడ్డి, ఏ. ప్రతాపరెడ్డి, ఎన్. శంభయ్య, సీఈవో గణేష్, సుధాకర్ పాల్గొన్నారు. కోదాడ మం డలంలోని కాపుగల్లు పీఏసీఎస్లో చైర్మన్ నంబూరి సూర్యం జెండా ఆవి ష్కరించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముత్తవరపు సుబ్బారావు, డైరెక్టర్లు నల్లూరి రమేష్, వీరబాబు, వీరయ్య, మల్లెల ఆదినారాయణ, రోశయ్య, పోలంపల్లి అచ్చమ్మ, వెంకటేశ్వర్లు, సీఈవో షేక్ జానీమియా పాల్గొన్నారు.