ప్రభుత్వానికి సహకరించండి!

ABN , First Publish Date - 2020-03-31T09:34:42+05:30 IST

ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని, ప్రభుత్వానికి సహకరించాలని ఒంగోలుకు చెందిన షురా పెద్ద సయ్యద్‌ హమీద్‌ పిలుపునిచ్చారు. ‘‘ఢిల్లీలోని హజరత్‌ నిజాముద్దీన్‌ ప్రాంతంలోని బంగ్లేవాలి

ప్రభుత్వానికి సహకరించండి!

  • ఒంగోలుకు చెందిన మత పెద్ద పిలుపు

ఒంగోలు నగరం,  మార్చి 30: ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని, ప్రభుత్వానికి సహకరించాలని ఒంగోలుకు చెందిన షురా పెద్ద సయ్యద్‌ హమీద్‌ పిలుపునిచ్చారు. ‘‘ఢిల్లీలోని హజరత్‌ నిజాముద్దీన్‌ ప్రాంతంలోని బంగ్లేవాలి మసీదులో ప్రార్థనలు జరిగాయి. యాత్రకు వెళ్లిన వారందరికీ కరోనా వచ్చిందనే వాదనలో  నిజం లేదు.  చీరాలకు చెందిన వ్యక్తికి వైరస్‌ పవిత్ర మసీదులో సోకే అవకాశమే లేదు. ప్రయాణంలో రైలులో కానీ, ఇతర ఏదో మార్గంలో కానీ సోకి ఉంటుంది.  సోమవారం నిజాముద్దీన్‌ ప్రాంతంలోని 2 వేల మందికి మిలటరీ వైద్యులు కరోనా పరీక్షలు  నిర్వహించగా... ఒక్కరికీ పాజిటివ్‌ రాలేదు’’ అని తెలిపారు.

Updated Date - 2020-03-31T09:34:42+05:30 IST