వజ్రోత్సవాల నిర్వహణకు సహకరించాలి

ABN , First Publish Date - 2022-08-08T06:02:08+05:30 IST

స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేం దుకు సహకరించాలని కార్పొరేటర్లు, కోఆప్షన్‌ సభ్యులను మేయర్‌ అనిల్‌ కుమార్‌ కోరారు.

వజ్రోత్సవాల నిర్వహణకు సహకరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న మేయర్‌అనిల్‌ కుమార్‌

- మేయర్‌ అనిల్‌ కుమార్‌

కోల్‌సిటీ, ఆగస్టు 7: స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేం దుకు సహకరించాలని కార్పొరేటర్లు, కోఆప్షన్‌ సభ్యులను మేయర్‌ అనిల్‌ కుమార్‌ కోరారు. ఈ మేరకు ఆదివారం కార్పొరేషన్‌ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. స్వాతంత్య్రం సిద్ధించి 75ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశభక్తి భావ న, స్వాతంత్య్ర స్ఫూర్తి ప్రజలందరిలో మేల్కొపే విధంగా వజ్రోత్సవాలను అంగరం గా వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ఈ మేరకు వజ్రో త్సవ ద్వీసప్తాహం ఆగస్టు 8 నుంచి 22వరకు నిర్వహిస్తున్నామన్నారు. ఫ్రీడమ్‌ కప్‌ ఆటపోటీలు, ఫ్రీడమ్‌రన్‌, జాతీయ సమాఖ్యత రక్షాబంధన్‌, వనమహోత్సవ్‌ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగిరేలా చేపట్టా లన్నారు. ఈ కార్యక్రమ విజయవంతానికి కార్పొరేటర్లు, కోఆప్షన్‌ సభ్యులు కృషి చే యాలన్నారు. ఈ సమావేశంలో కమిషనర్‌ సుమన్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-08T06:02:08+05:30 IST