కూలీ డబ్బులు ఎలుకలపాలు
ABN , First Publish Date - 2021-07-31T06:54:53+05:30 IST
మహిళా కూలీ దాచుకున్న డబ్బులు ఎలుకల పాలయ్యాయి.
బ్యాంకులో మార్చుకునే అవకాశం ఇవ్వాలని వినతి
మోత్కూరు, జూలై 30: మహిళా కూలీ దాచుకున్న డబ్బులు ఎలుకల పాలయ్యాయి. బాధితురాలు అడ్డగూ డూరు మండలం లక్ష్మీదేవికాల్వ గ్రామా నికి చెందిన కొలుగూరి లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. ఆమెకు భర్త లేడు. కూలీనాలికి వెళుతూ కూడబెట్టిన రూ.5 వేలను బీరువాలో దాచుకుంది. నెలరోజుల అనంతరం శుక్రవారం బీరువా తెరువగా ఎలుక బయటకు పరుగెత్తింది. బీరువాలో ఉన్న రూ.5 వేల నోట్లను, పాత దుస్తులను ఎలుక కొరికేసింది. ఈ నోట్లు చెల్లవని అంటున్నారని లక్ష్మి కన్నీరుము న్నీరవుతోంది. ఈ నోట్లను మోత్కూరు ఎస్బీఐలో మార్చుకునే అవకాశం కల్పించాలని ఆమె వేడుకొంటోంది.