కూలీ దారుణ హత్య

ABN , First Publish Date - 2022-06-29T05:35:01+05:30 IST

మండలంలోని వేల్పుమడుగుకు వెళ్లే దారిలో రామకృష్ణ (41) అనే కూలీని మంగళవారం ఉదయం దారుణంగా హత్య చేశారు.

కూలీ దారుణ హత్య
రామకృష్ణ (ఫైల్‌)

బత్తలపల్లి, జూన 28: మండలంలోని వేల్పుమడుగుకు వెళ్లే దారిలో రామకృష్ణ (41) అనే కూలీని మంగళవారం ఉదయం దారుణంగా హత్య చేశారు. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని అప్రాచెరువు గ్రామానికి చెందిన నారాయణ, నాగమ్మ దంపతుల కుమారుడు రామకృష్ణ కూలి పనులు చేసుకుంటుండేవాడు. ఇతడికి భార్య త్రివేణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె ఇటీవలే వివాహం చేసుకుంది. భర్తతో మనస్పర్థల నేపథ్యంలో త్రివేణి రెండో కుమార్తెను తీసుకుని.. కొన్ని రోజుల క్రితం పెద్ద కూతురు ఇంటికెళ్లింది. రామకృష్ణ ఇంట్లో ఒక్కడే ఉంటుండేవాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ధర్మవరం నుంచి వేల్పుమడుగు వెళ్లే దారిలో దారుణ హత్యకు గురై, పడిపోయాడు. గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. రామకృష్ణ బైక్‌ పక్కనే ఉంది. హత్యాస్థలాన్ని సీఐ మన్సూరుద్దీన, ఎస్‌ఐ శ్రీహర్ష పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య చేసి ఉంటారని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి.


Updated Date - 2022-06-29T05:35:01+05:30 IST