వంటగ్యాస్‌ ధరలను తగ్గించాలి

ABN , First Publish Date - 2021-03-04T06:21:39+05:30 IST

కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్‌ ధరలను తగ్గించాలని కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.

వంటగ్యాస్‌ ధరలను తగ్గించాలి
వంటావార్పులో కాంగ్రెస్‌ నాయకులు

చందుర్తి, మార్చి 3:  కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్‌ ధరలను తగ్గించాలని కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో బుధవారం వంటా వార్పు చేపట్టి నిరసన తెలిపారు.  అనంతరం జడ్పీటీసీ నాగం కుమార్‌ మాట్లాడుతూ లాక్‌డౌన్‌తో ప్రజలు ఆర్థికంగా చితికిపోయారన్నారు. పేద కుటుంబాలు, కార్మికులు, చిన్న, సన్న కారు రైతులను ఆదుకోవాల్సిన సమయంలో ధరలు పెంచి అప్పుల ఊబిలోకి నెడుతోందన్నారు.  ఎంపీ టీసీ  రేణుక-సత్తయ్య,కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు రామ స్వామి, నాయకులు  ప్రభాకర్‌,  దేవస్వామి,   మల్లేశం,  రాంచం ద్రం, చంద్రయ్య, అజయ్‌, ప్రసాద్‌, వెంకటేశం పాల్గొన్నారు.

Updated Date - 2021-03-04T06:21:39+05:30 IST