కోర్టు ధిక్కార కేసులో ఇద్దరు అధికారులకు శిక్ష
ABN , First Publish Date - 2021-07-07T02:46:03+05:30 IST
కోర్టు ధిక్కార కేసులో ఇద్దరు అధికారులకు హైకోర్టు శిక్ష విధించింది. ఐఏఎస్
అమరావతి: కోర్టు ధిక్కార కేసులో ఇద్దరు అధికారులకు హైకోర్టు శిక్ష విధించింది. ఐఏఎస్ గిరిజాశంకర్, ఐఎఫ్ఎస్ చిరంజీవి చౌదరికి శిక్ష విధించింది. మంగళవారం కోర్టు పనిగంటలు ముగిసే వరకు కోర్టులోనే ఉండాలని ఇద్దరికి ఏపీ హైకోర్టు ఆదేశించింది. తొలుత ఈ కేసులో 9 రోజులు సాధారణ జైలు శిక్ష, వెయ్యి జరిమానాను ఏపీ హైకోర్టు విధించింది. మానవతా దృక్పధంతో తీర్పును హైకోర్టు సవరించింది. జరిమానా సొమ్ము చెల్లించకపోతే మూడు రోజులు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని హైకోర్టు ఆదేశించింది.
ఇలాంటి అధికారులపై దయ చూపిస్తే ఇతర ప్రభుత్వ అధికారులకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. కోర్టు ఉత్తర్వులను 9 నెలల పాటు అమలు చేయకుండా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేశారని హైకోర్టు పేర్కొంది. ఉద్యానవన శాఖలో ఎంపిక ప్రక్రియలో పాల్గొనే అవకాశం తమకు లేకుండా చేశారని 36 మంది అభ్యర్థులు పిటిషన్ వేశారు.