వివాహ రిజిస్ట్రేషన్‌పై వివాదం!

ABN , First Publish Date - 2020-05-21T10:24:26+05:30 IST

నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో బుధవారం ఓ వివాహ రిజిస్ర్టేషన్‌కు సంబంధించి వివాదం తలెత్తింది. సబ్‌ రిజిస్ర్టార్‌తో

వివాహ రిజిస్ట్రేషన్‌పై వివాదం!

ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందులు పెడుతున్నారంటూ బాధితుల ఆవేదన 

ఖానాపూర్‌ సబ్‌రిజిస్ర్టార్‌తో వాగ్వాదం


ఖానాపూర్‌, మే 20 : నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో బుధవారం ఓ వివాహ రిజిస్ర్టేషన్‌కు సంబంధించి వివాదం తలెత్తింది. సబ్‌ రిజిస్ర్టార్‌తో బాధిత కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. పూర్తిస్థాయి వివరాలిలా ఉన్నాయి.. స్థానిక శాంతినగర్‌కు చెందిన మదిరె సత్యనారాయణ కూతురు వివాహ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో మంగళవారం స్లాట్‌ బుక్‌ చేసుకొని కార్యాలయానికి రాగా, సబ్‌రిజిస్ట్రార్‌ లేకపోవడంతో బుధవారం ఉదయం కుటుంబీకులు మళ్లీ ఆఫీసుకు వచ్చారు.


వివాహం తాలూకు రిజిస్ట్రేష న్‌ చేయాలని సబ్‌రిజిస్ర్టార్‌ మహేందర్‌రెడ్డిని కోరడంతో ఈ రోజు చేయడం కు దురదని చెప్పడంతో వాగ్వాదం నెలకొంది. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. కేవలం డబ్బులు ఇచ్చే వారికి పనులు అవుతున్నాయని, రెండు రోజులుగా కార్యాలయానికి వస్తున్నా పని జరగడం లేదని ఆరోపించారు. ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. దీనిపై సబ్‌రిజిస్ర్టార్‌ మహేం దర్‌రెడ్డిని వివరణ కోరగా.. తాము ఉద్దేశపూర్వకంగా ఎవ్వరిని ఇబ్బందులు పెట్ట డం లేదని, నిబంధనల ప్రకారమే ముందుకెళ్తున్నామని తెలిపారు.

Updated Date - 2020-05-21T10:24:26+05:30 IST