పొంగూరులో ఇళ్ల స్థలాల వివాదం
ABN , First Publish Date - 2020-07-04T10:41:04+05:30 IST
పొంగూరు గ్రామంలో ఇళ్ల స్థలాలకు సంబంధించి శుక్రవారం గందరగోళం నెలకొంది. తమకు అన్యాయం జరగిందంటూ దళితులు స్థలాల్లోని రాళ్లను
తహసీల్దారు వాహనాన్ని అడ్డుకున్న దళితులు
లేఅవుట్లో రాళ్ల పీకివేత
మర్రిపాడు, జూలై 3 : పొంగూరు గ్రామంలో ఇళ్ల స్థలాలకు సంబంధించి శుక్రవారం గందరగోళం నెలకొంది. తమకు అన్యాయం జరగిందంటూ దళితులు స్థలాల్లోని రాళ్లను పీకేసి తహసీల్దారు సుధాకర్ను అడ్డుకున్నారు. గ్రామంలో దళితులకు శ్మశాన స్థలం ఖాళీగా ఉంది. ఇందులో దళితులతోపాటు మరికొందరికి స్థలాలు కేటాయించారు. శుక్రవారం లాటరీ తీసేందుకు తహసీల్దారు రాగా వాహనాన్ని అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. తమకే స్థలాలు ఇవ్వాలని నిలదీసి, వెనక్కు పంపారు. అనంతరం స్థలాల్లో పాతిన రాళ్లను పీకేశారు. దీంతో స్థలాల కేటాయింపు నిలిచిపోయింది.