West Godavari: జాతీయ జెండా స్థూపం నిర్మాణంపై వివాదం

ABN , First Publish Date - 2022-08-14T04:26:55+05:30 IST

పెనుమంట్ర మండలం మార్టేరులో జాతీయ జెండా స్థూపం నిర్మాణం విషయమై వివాదం..

West Godavari: జాతీయ జెండా స్థూపం నిర్మాణంపై వివాదం

పశ్చిమగోదావరి: పెనుమంట్ర మండలం మార్టేరులో జాతీయ జెండా స్థూపం నిర్మాణం విషయమై వివాదం తలెత్తింది.  గ్రామ ప్రజలు.. స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చి జెండా స్థూపం నిర్మాణం చేపట్టారు. అయితే నిర్మాణం చెయ్యొద్దంటూ రెవెన్యూ, పంచాయతీ, పోలీస్ అధికారులు పనులు నిలిపి వేయించారు.దీంతో అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం చేశారు.  జాతీయ జెండా స్తూపం విషయంలో  రాజకీయం ఏంటని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తామని  గ్రామ ప్రజలు అంటున్నారు. దీంతో గ్రామంలో టెన్షన్ వాతావరణ నెలకొంది. 

Updated Date - 2022-08-14T04:26:55+05:30 IST