సీఎం సహాయనిధికి వెల్లువెత్తిన విరాళాలు
ABN , First Publish Date - 2020-04-08T12:13:14+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా సీఎం సహాయ నిధికి జిల్లా ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్
విజయనగరం రూరల్, ఏప్రిల్ 7: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా సీఎం సహాయ నిధికి జిల్లా ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ప్రతి నిధులు రూ.30వేలు చెక్కును ఎమ్మెల్యే కోలగట్లకు మంగళ వారం అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతి నిధులు రామయ్యపంతులు, ప్రసాద్, రాజు పాల్గొన్నారు.
క్రైస్తవసంఘం నేత విజయ్కుమార్ ఆధ్వర్యంలో పాస్టర్స్ ఫెలోషిప్ ప్రతినిధులు మంగళవారం సీఎం సహాయ నిధికి రూ.50వేలు విరాళాన్ని ఎమ్మెల్యే శంబంగికి అందజేశారు. కార్యక్రమంలో ప్రతినిధులు మోషేరాజ్, నతా నియేలు, జాన్బాబు, ధనుంజయనాయుడు, కామేశ్వరరావు, సీతారామస్వామి తదితరులు పాల్గొన్నారు. అలాగే వ్యాపారి కింతలి శ్రీనివాసరావు రూ.25వేలు, ఫీల్డు కౌన్సిల్, సీబీఎం చర్చి మేనేజ్మెంట్, డీసీసీబీ మేనేజరు ముప్పాల రామకృష్ణ, పెద్దింటి రామారావు, తెంటు సత్యంనాయుడు, లారీ ఓనర్స్ అసోసియేషన్, చార్టర్డ్ అకౌంటెంట్ జేసీహెచ్ నారాయణ మూర్తి, గుడ్ల ప్రసన్నలు పదివేల రూపాయల చొప్పున విరాళాలను ఎమ్మెల్యే శంబంగికి అందజేశారు.