‘ఇంటింటికీ ఆరోగ్యం’ కార్యక్రమానికి సహకరించాలి
ABN , First Publish Date - 2022-01-21T06:46:34+05:30 IST
కరోనా నియంత్రణలో భాగంగా పట్టణంలో చేపట్టే ‘ఇంటింటికీ ఆరోగ్యం’ కార్యక్రమానికి సహకరించాలని మునిసిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి అన్నారు.
సూర్యాపేటటౌన్, జనవరి 20: కరోనా నియంత్రణలో భాగంగా పట్టణంలో చేపట్టే ‘ఇంటింటికీ ఆరోగ్యం’ కార్యక్రమానికి సహకరించాలని మునిసిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి అన్నారు. పట్టణంలో శుక్రవారం నుంచి నిర్వహించే ‘ఇంటింటికీ ఆరోగ్యం’ కార్యక్రమంలో గురువారం సూర్యాపేటలోని మునిసిపల్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు, ఆర్పీలు, ఏఎన్ఎంలకు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లా డారు. సర్వేలో జ్వరం, దగ్గు, జలుబు ఉన్నవారిని గుర్తించి మెడికల్ కిట్లు అందజేస్తా మన్నారు. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకోని వారిని గుర్తించి టీకా వేస్తామన్నారు. అర్హులకు బూస్టర్ డోస్ వేస్తామ న్నారు. ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి, కొవిడ్ నిబం ధనలు పాటించాలని ఆయన సూచించారు. సమావేశంలో అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్లు రమ్య, ఉషా, శ్రీకాంత్, మెప్మా అధికారులు పాల్గొన్నారు.