కర్ఫ్యూకు సహకరించండి : ఎస్పీ
ABN , First Publish Date - 2021-06-13T05:17:47+05:30 IST
జిల్లాలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా అమలవుతున్న కర్ఫ్యూ నిబంధనలకు ప్రజలు సహకరించాలని ఎస్పీ రాజకుమారి కోరారు.
విజయనగరం క్రైం, జూన్ 12: జిల్లాలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా అమలవుతున్న కర్ఫ్యూ నిబంధనలకు ప్రజలు సహకరించాలని ఎస్పీ రాజకుమారి కోరారు. శనివారం నగరంలోని గంటస్తంభం, రింగురోడ్డు, అంబేడ్కర్ జంక్షన్, ఎత్తుబ్రిడ్జి, కలెక్టరేట్ జంక్షన్ ప్రాంతాలను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎటువంటి కారణాలు తెలపకుండా రోడ్లపైకి వచ్చే వాహనదారులను ఆపి జరిమానా విధించాలని, వాహనాలను సీజ్ చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అత్యవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలని, ఇంటికే పరిమితం కావాలని సూచించారు. కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. భౌతిక దూరం పాటించాలని, మాస్క్ ధరించాలని చెప్పారు. ట్రాఫిక్ సీఐ మోహనరావు, సీఐ మురళీ తదితరులు ఉన్నారు.