వివాదాస్పద భూముల్లో దున్నకాలు
ABN , First Publish Date - 2022-05-20T05:56:08+05:30 IST
ఏర్పేడు మండలం చింతలపాళెం పంచాయతీ రెవెన్యూ పరిఽధిలో ఉన్న వివాదాస్పద భూములకు సంబంధించి అదే పంచాయతీలో ఉన్న మరాఠీపురం షికారీలకు, చింతలపాళెం, వెంకటపాళెం గ్రామాల రైతులకు పదేళ్ల నుంచి భూవివాదం నడుస్తోంది.
షికారీలపై పోలీసులకు రైతుల ఫిర్యాదు
ఏర్పేడు, మే 19: ఏర్పేడు మండలం చింతలపాళెం పంచాయతీ రెవెన్యూ పరిఽధిలో ఉన్న వివాదాస్పద భూములకు సంబంధించి అదే పంచాయతీలో ఉన్న మరాఠీపురం షికారీలకు, చింతలపాళెం, వెంకటపాళెం గ్రామాల రైతులకు పదేళ్ల నుంచి భూవివాదం నడుస్తోంది. ఈ భూముల్లో ఒకరినొకరు అడ్డుకోవడం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో గురువారం చింతలపాళెం రెవెన్యూ పరిధిలో సుమారు 20 ఎకరాల వివాదాస్పద భూముల్లో షికారీలు మళ్లీ దున్న కాలు చేపట్టారు. విషయం తెలుసుకున్న చింతలపాళెం, వెంకట పాళెం రైతులు ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను, రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు.