గిరిజన గ్రామాలపై నిరంతర పర్యవేక్షణ

ABN , First Publish Date - 2020-04-10T11:52:36+05:30 IST

ఏజెన్సీ ప్రాంతాల్లో కరోనా వైరస్‌ సోకకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూనే ఉన్నామని, గిరిజన గ్రామాలపై కూడా

గిరిజన గ్రామాలపై నిరంతర పర్యవేక్షణ

వైద్యులకు ఉప ముఖ్యమంత్రి ఆదేశం


జియ్యమ్మవలస, ఏప్రిల్‌ 9: ఏజెన్సీ ప్రాంతాల్లో కరోనా వైరస్‌ సోకకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూనే ఉన్నామని, గిరిజన గ్రామాలపై కూడా నిరంతరణ పర్యవేక్షణ చేయాలని దీనికి వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. గురువారం చినమేరంగి సామాజిక ఆరోగ్య కేం ద్రం ఆవరణలో ఆమె కురుపాం నియోజకవర్గంలో ఉన్న 10 పీహెచ్‌ సీలు, మూడు సీహెచ్‌సీల వైద్యాధికారులు, సిబ్బందికి అత్యవసర కి ట్లు పంపిణీ చేశారు.


ఏజెన్సీ ప్రాంతాల్లోకి కొత్త వ్యక్తులు ఎ వరూ రాకుండా జాగ్రత్త పడటమే కాకుండా అనారోగ్యంతో ఉన్న వారి విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆసుపత్రుల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏ ఒక్క గిరిజనుడికి ఇబ్బంది కలిగినా ఉపేక్షించేది లేదని హెచ్చ రించారు.  అరకు పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ అధ్యక్షుడు  శ త్రుచర్ల పరీక్షిత్‌రాజు, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ రవికుమా ర్‌రెడ్డి, కురుపాం, భద్రగిరి, చినమేరంగి సీహెచ్‌సీల వైద్యాధికారులు   10 పీహెచ్‌సీల వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-04-10T11:52:36+05:30 IST