‘పాత చార్జీలనే కొనసాగించాలి’
ABN , First Publish Date - 2021-04-13T05:17:45+05:30 IST
పాత విద్యుత్ చార్జీలనే కొనసాగించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వీరశేఖర్, ఏరియా కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు.
పోరుమామిళ్ల, ఏప్రిల్ 12 : పాత విద్యుత్ చార్జీలనే కొనసాగించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వీరశేఖర్, ఏరియా కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. సోమవారం పో రుమామిళ్లలో సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ బి ల్లులు ఫిక్స్డ్ చార్జీలని, విద్యుత్ సంస్థల యాజమాన్యం ప్రజలను తప్పుదోవపట్టిస్తూ వారికిష్టమొచ్చినట్లు ధరలు పెంచి సామాన్యుడిపై భారం పెంచిందన్నారు.