శ్రీకాకుళంలోనే కొనసాగించండి

ABN , First Publish Date - 2022-01-27T05:40:21+05:30 IST

శ్రీకాకుళంలోనే కొనసాగించండి

శ్రీకాకుళంలోనే కొనసాగించండి

భామిని: భామిని మండలాన్ని శ్రీకాకుళం జిల్లాగానే కొనసాగించాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు.   జిల్లాల విభజన నిర్ణయం ప్రభుత్వం ప్రకటించడంతో టీడీపీ  నాయకులు  భామినిలో బుధవారం సమావేశం నిర్వహిం చారు.జిల్లాను మార్చితే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. భామినిని విభజించి మన్యం జిల్లాలో కలిపితే 160 కిలో మీటర్లు దూరం పెరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ విషయంపైౖ చట్ట, న్యాయ మైన సలహాలు తీసుకుంటా మని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ రవి నాయుడు, జగదీశ్వరరావు, బి.ఆనందరావు, గోవిందరా వు, ప్రకాశరావునాయుడు, ప్రసాదరావు పాల్గొన్నారు. 

- పాలకొండ : పాలకొండ రెవెన్యూ డివిజన్‌ను మూడు ముక్కలు చేసి మూడు జిల్లాల్లో విలీనం చేయడం తగదని జడ్పీటీసీ మాజీ సభ్యుడు  ఎన్ని రాజు తెలిపారు.   పాల కొండలో విలేకరులతో మాట్లాడుతూ రాజాం, పాలకొండ నియోజక వర్గాలు రిజర్వ్డ్‌ స్థానాలు కావడంతో నాయ కులు ఉద్దేశ్యపూర్వకంగా ప్రతిపాదించడం తగదన్నారు.  

Updated Date - 2022-01-27T05:40:21+05:30 IST