అసద్‌పై కోర్టు ధిక్కార చర్యలు కోరుతూ వ్యాజ్యం

ABN , First Publish Date - 2020-08-08T07:43:09+05:30 IST

మజ్లిస్‌ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో శుక్రవారం ఒక వ్యాజ్యం దాఖలైంది...

అసద్‌పై కోర్టు ధిక్కార చర్యలు కోరుతూ వ్యాజ్యం

న్యూఢిల్లీ, ఆగస్టు 7: మజ్లిస్‌ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో శుక్రవారం ఒక వ్యాజ్యం దాఖలైంది. యాంటీ టెర్రరిస్టు ఫ్రంట్‌ ఇండియా అధ్యక్షుడు వీరేశ్‌ శాండిల్య ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. అయోధ్యలో భూమి పూజకు ముం దు సుప్రీంకోర్టు పవిత్రతను, విజ్ఞతను తప్పుబడుతూ జూలై 30న ఒక చానల్‌లో అసదుద్దీన్‌ చేసిన వ్యాఖ్యలపై పిటిషనర్‌ ఈ వ్యాజ్యం వేశారు.   

Updated Date - 2020-08-08T07:43:09+05:30 IST