నాగులపల్లిలో కలుషిత నీరు సరఫరా

ABN , First Publish Date - 2022-05-24T04:59:23+05:30 IST

మండలంలోని నాగులపల్లిలో వారం రోజుల నుంచి కలుషిత నీరు సరఫరా అవుతున్నట్లు, తాగు నీటిలో తోకపురుగులు వస్తున్నాయని గ్రామస్థులు తెలిపారు.

నాగులపల్లిలో కలుషిత నీరు సరఫరా

తూప్రాన్‌రూరల్‌, మే 23: మండలంలోని నాగులపల్లిలో వారం రోజుల నుంచి కలుషిత నీరు సరఫరా అవుతున్నట్లు, తాగు నీటిలో తోకపురుగులు వస్తున్నాయని గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో ఉన్న వాటర్‌ప్లాంటు నిర్వహణ సరిగా లేదని, గ్రామ పంచాయతీ వారు ప్లాంటు నిర్వహణను పట్టించుకోకపోవడంతో పురుగులు, చెత్తతో కూడిన కలుషితమైన నీళ్లు వస్తున్నాయని చెప్పారు. ఇంటింటికీ నల్లా ద్వారా సరఫరా అవుతున్న మిషన్‌ భగీరథ నీరు కూడ అలాగే ఉంటున్నాయని తెలిపారు. వాటర్‌ ట్యాంకును శుభ్రం చేయకపోవడం, బ్లీచింగ్‌ పౌడర్‌ను ఉపయోగించక పోవడంవల్ల ట్యాంకులోపలి భాగంలో చెత్తాచెదారం, నాచు పేరుకుపోయి పురుగులతో కూడిన కలుషిత నీరు సరఫరా అవుతున్నట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-24T04:59:23+05:30 IST