కంటెన్మెంట్‌ ప్రాంతాలు కట్టుదిట్టం

ABN , First Publish Date - 2020-06-07T07:29:17+05:30 IST

కంటెన్మెంట్‌ ప్రాంతాలను కట్టుదిట్టంగా నిర్వహించాలని రూరల్‌ ఎస్పీ విజయరావు చెప్పారు.

కంటెన్మెంట్‌ ప్రాంతాలు కట్టుదిట్టం

రూరల్‌ ఎస్పీ విజయరావు


తెనాలి అర్బన్‌, బాపట్లటౌన్‌, జూన్‌ 6 : కంటెన్మెంట్‌ ప్రాంతాలను కట్టుదిట్టంగా నిర్వహించాలని  రూరల్‌ ఎస్పీ విజయరావు చెప్పారు. తెనాలి, బాపట్ల పట్టణాల్లోని కంటైన్‌మెంట్‌ ఏరియాల్లో ఆయన శనివారం పర్యటించారు. కరోనా వైరస్‌ కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన ఏరియాల్లో ప్రైమరీ, సెకండరీ కేసులను పరిశీలించి రక్తనమూనాలను సేకరించటం జరుగుతుందన్నారు. కరోనా రికవరీలు కూడా జిల్లాలో అధికంగా ఉన్నాయన్నారు. ప్రతిఒక్కరు మాస్క్‌లు, శానిటైజర్‌ను ఉపయోగించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, పట్టణ, రూరల్‌ సీఐలు అశోక్‌బాబు, కె.శ్రీనివాసరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ ఎ.భానుప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-07T07:29:17+05:30 IST