టీడీపీ నాయకుల పరామర్శ
ABN , First Publish Date - 2020-09-24T07:59:11+05:30 IST
నేదునూరుకు చెందిన టీడీపీ నాయ కుడు కేతా వెంకటేశ్వరరావు ఇటీవల మృతి చెందడంతో కుటుంబ సభ్యు లను పార్టీ గ్రామశాఖ
అయినవిల్లి, సెప్టెంబరు 23: నేదునూరుకు చెందిన టీడీపీ నాయకుడు కేతా వెంకటేశ్వరరావు ఇటీవల మృతి చెందడంతో కుటుంబ సభ్యులను పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు తమ్మన శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధ వారం పలువురు పరామర్శించారు. పార్టీ కోసం అహర్నిశలు కృషిచేసిన వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పార్టీ పరంగా ఆదుకుంటామని మంద పాటి కిరణ్కుమార్ అన్నారు. వైస్ ఎంపీపీ సానబోయిన దుర్గ, ఎంపీ టీసీ మాజీ సభ్యుడు కళ్లేపల్లి సుబ్బరాజు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ పినిపే ప్రభుదాసు, నాగవరపు గంగాధర్, గుత్తుల కృష్ణ సంతాపం తెలిపారు.