కువైత్‌లోని ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన.. సాధారణ సేవలను..!

ABN , First Publish Date - 2021-03-05T07:03:42+05:30 IST

కువైత్‌లోని ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది. ఎంబసీలో సాధారణ కాన్సులర్ సేవలను మరికొంత కాలం నిలిపివేస్తున్నట్టు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. కువైత్‌లో కరోనా మమమ్మారి విజృంభణ మ

కువైత్‌లోని ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన.. సాధారణ సేవలను..!

న్యూఢిల్లీ: కువైత్‌లోని ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది. ఎంబసీలో సాధారణ కాన్సులర్ సేవలను మరికొంత కాలం నిలిపివేస్తున్నట్టు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. కువైత్‌లో కరోనా మమమ్మారి విజృంభణ మళ్లీ మొదలైంది. ప్రతిరోజు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో సాధారణ కాన్సులర్ సేవలను కువైత్‌లోని ఇండియన్ ఎంబసీ ఈ నెల 3వరకు రద్దు చేసింది. కాగా.. కొవిడ్ ఉధృతి నేపథ్యంలో ఈ సేవలను మార్చి 11 వరకు నిలిపివేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. కువైత్ హెల్త్ అథారిటీ చేసిన సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇండియన్ ఎంబసీ పేర్కొంది. ఎమర్జెన్సీ సేవలను మాత్రం ప్రాధాన్యత క్రమంలో అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. గడిచిన 24 గంటల్లో కువైత్‌లో 1,716 మంది మహమ్మారి బారినపడగా.. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2లక్షలకు చేరువైంది. మరణాల సంఖ్య 1,105కి చేరింది. 


Updated Date - 2021-03-05T07:03:42+05:30 IST