నిర్మాణాలను వేగవంతం చేయాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-08-04T11:03:50+05:30 IST

జిల్లాలో చేపట్టిన బైపాస్‌ రోడ్లు, కొత్త కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు సంబంధిత అధికా

నిర్మాణాలను వేగవంతం చేయాలి: కలెక్టర్‌

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, ఆగస్టు 3: జిల్లాలో చేపట్టిన బైపాస్‌ రోడ్లు, కొత్త కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు సంబంధిత అధికా రులను ఆదేశించారు. సోమవారం ఆయన రోడ్లు, భవనాలు సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ సర్కిల్‌ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ కొత్త కలెక్టరేట్‌, బైపాస్‌ పనులు త్వరగా పూర్తి చేసి అనుకున్న సమయానికి అప్ప చెప్పాలని, ఆ దిశగా పని చేయాలని ఆదేశించారు. మంగళవారం నిర్వహించే ఇంజనీర్‌ హరితహారం కార్యక్రమాలకు సిద్ధం చేసిన ప్రణాళికను కలెక్టర్‌ పరిశీలించారు. నిర్దేశించిన లక్షాన్ని పూర్తి చేయాలని, కార్యాలయాలు, ప్రభుత్వ స్థలాలు, రోడ్లకు ఇరువైపులా ఉండే ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం కార్యాలయంలో మొక్కలు నాటారు. 

Updated Date - 2020-08-04T11:03:50+05:30 IST