రైతు వేదిక భవనం నిర్మాణానికి శంకుస్థాపన

ABN , First Publish Date - 2020-06-30T11:37:51+05:30 IST

తెలంగాణ ప్రభుత్వ ద్వారా రైతుల కోసం నిర్మిస్తున్న రైతు వేదిక భవనం నిర్మాణానికి మండల కేంద్రంలోని శివారులో సోమవారం మాజీ మంత్రి

రైతు వేదిక భవనం నిర్మాణానికి శంకుస్థాపన

రాజాపూర్‌, జూన్‌ 29: తెలంగాణ ప్రభుత్వ ద్వారా రైతుల కోసం నిర్మిస్తున్న రైతు వేదిక భవనం నిర్మాణానికి మండల కేంద్రంలోని శివారులో సోమవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.20 లక్షలతో నిర్మిస్తున్నాట్లు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయనికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు.


అంతకు ముందు హరిత హారంలో భాగంగా ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ప్రతిఒక్కరూ హరిత హారంలో భాగంగా మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ పట్లా ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ సుశీల రమేష్‌నాయక్‌, మండల రైతు బంధు సంఘం అధ్యక్షుడు నర్సిములు, జడ్పీటీసీ మోహన్‌ నాయక్‌, మార్కెట్‌ రమిటీ చైర్మన్‌ రఘువీరారెడ్డి, వైస్‌ ఎంపీపీ మహిపాల్‌ రెడ్డి, ఎంపీటీసీ అభిమన్యురెడ్డి, సర్పంచ్‌ బచ్చిరెడ్డి, కో-ఆప్షన్‌ అల్తాఫ్‌, డైరెక్టర్‌ దేవేందర్‌, శ్రీశైలం యాదవ్‌, తహసీల్దార్‌ శంకర్‌, ఎంపీడీవో లక్ష్మీదేవి, ఎవో నరేందర్‌, నరహరి పాల్గొన్నారు. 


ఎమ్మెల్మేకు వినతి పత్రం ఇచ్చిన ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్లు

మండల కేంద్రంతోపాటు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్లను తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి అందజేశారు. ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ల విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతానని హామీ ఇచ్చారు.

Updated Date - 2020-06-30T11:37:51+05:30 IST