నాలుగేళ్లయినా పూర్తికాని ‘డబుల్‌’ ఇళ్ల నిర్మాణం

ABN , First Publish Date - 2022-05-28T05:29:55+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పంపిణీ పేదలకు అందని ద్రాక్షలా మారింది.

నాలుగేళ్లయినా పూర్తికాని ‘డబుల్‌’ ఇళ్ల నిర్మాణం
అసంపూర్తిగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు

  కోనాపూర్‌లో నిలిచిన నిర్మాణ పనులు

 పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు


దౌల్తాబాద్‌, మే 27: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పంపిణీ పేదలకు అందని ద్రాక్షలా మారింది. దౌల్తాబాద్‌ మండల పరిధిలోని కోనాపూర్‌ గ్రామానికి 2018లో అప్పటి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి 40 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను మంజూరు చేయించారు. ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడంతో నాలుగు సంవత్సారాలవుతున్నా పూర్తికాలేదు. కొన్ని రోజులుగా పనులు నిలిచిపోవడంతో బేస్మెంట్లు కుంగుతున్నాయి. ఇనుప కడ్డీలు తుప్పు పడుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతో పేదలు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు నోచుకోవడం లేదు. పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో నిర్మాణాలు మందుబాబులకు అడ్డాగా మారాయి. 


 

Updated Date - 2022-05-28T05:29:55+05:30 IST