నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2020-12-06T05:34:52+05:30 IST

ప్రభుత్వ నిధులతో చేపట్టే రహదారులు, భవన నిర్మాణాలు వేగవంతం చేయాలని పంచాయతీరాజ్‌ ఈఈ వరప్రసాద్‌ చెప్పారు.

నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

  • పంచాయతీరాజ్‌ ఈఈ వరప్రసాద్‌

కడియం, డిసెంబరు 5: ప్రభుత్వ నిధులతో చేపట్టే రహదారులు, భవన నిర్మాణాలు వేగవంతం చేయాలని పంచాయతీరాజ్‌ ఈఈ వరప్రసాద్‌ చెప్పారు. శనివారం బుర్రిలంక గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. జక్కంపూడి రామ్మోహనరావు విగ్రహం నుంచి చిరంజీవి కార్యాలయం వరకు ఉన్న రోడ్డు, డ్రైనుకు సంబంధించి డీఈ సూర్యనారాయణ, జేఈ త్రిమూర్తులుకు ఆయన సూచనలు చేశారు. ఈ రోడ్డులో ఉన్న ఆక్రమణలు తొలగించాలని పంచాయతీ కార్యదర్శి శిరీషకు సూచించారు. పీహెచ్‌సీ మంజూరైనందున సబ్‌హెల్త్‌సెంటర్‌ నిర్మించవద్దని వైసీపీ నాయకులు వరప్రసాద్‌ను కోరగా, దీనికి జియోట్యాగింగ్‌ అయిందని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి పీహెచ్‌సీ అనుమతి పొందాలని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొత్తపల్లి శివాజీ, తాడాల చక్రవర్తి, వారా రాము, కొత్తపల్లి మూర్తి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T05:34:52+05:30 IST