టీఆర్‌ఎస్‌ హయాంలోనే నియోజకవర్గ అభివృద్ధి

ABN , First Publish Date - 2021-10-27T03:34:42+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాం లోనే బెల్లంపల్లి పట్టణంతో పాటు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. మంగళవారం పలువురు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరగా క్యాంపు కార్యాలయంలో వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి అనేక పథకా లను అమలు చేస్తున్నారని తెలిపారు.

టీఆర్‌ఎస్‌ హయాంలోనే నియోజకవర్గ అభివృద్ధి
టీఆర్‌ఎస్‌లో చేరిన వారితో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

బెల్లంపల్లి, అక్టోబరు 26: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాం లోనే బెల్లంపల్లి పట్టణంతో పాటు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. మంగళవారం పలువురు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరగా క్యాంపు కార్యాలయంలో వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి అనేక పథకా లను అమలు చేస్తున్నారని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. బుధవారం పద్మశాలి భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే నియోజకవర్గ స్థాయి సమావేశానికి టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.  టీబీజీకేఎస్‌ నాయకులు రాయలింగు, సత్యనారాయణ, శ్రీనివాస్‌, స్వరూప, సుదర్శన్‌ పాల్గొన్నారు.  సోమగూడెంకు చెందిన వార్డు సభ్యులు చిప్పకుర్తి తిరుపతికి ఎస్సీ కార్పొ రేషన్‌ ద్వారా మంజూరైన ఆటో ట్రాలీని, అతని భార్య మమతకు మంజూరైన రూ. 20 వేల సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మంగళవారం క్యాంపు కార్యాలయంలో అందించారు.  

Updated Date - 2021-10-27T03:34:42+05:30 IST