విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటం

ABN , First Publish Date - 2022-08-13T05:56:37+05:30 IST

వి ద్యార్థుల సమస్యల పై ఏఐఎ్‌సఎఫ్‌ ని రంతరం పోరాటం చేస్తుందని ఆ సం ఘం జిల్లా అధ్యక్షుడు వలమల్ల ఆంజనేయులు అ న్నారు.

విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటం
ఏఐఎ్‌సఎఫ్‌ జెండాను ఆవిష్కరిస్తున్న నాయకులు

దేవరకొండ, ఆగస్టు 12: వి ద్యార్థుల సమస్యల పై ఏఐఎ్‌సఎఫ్‌ ని రంతరం పోరాటం చేస్తుందని ఆ సం ఘం జిల్లా అధ్యక్షుడు వలమల్ల ఆంజనేయులు అ న్నారు. శుక్రవారం ఏఐఎ్‌సఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని సీపీఐ కార్యాలయం లో ఏఐఎ్‌సఎఫ్‌ జెండాను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. స్వాతంత్య్రం రాకముందే ఎందరో వీరుల ఆశయ సాధన కోసం బబృద్దీన బాసు, ప్రేమ్‌ నారాయ ణ భార్గవ్‌ నాయకత్వంలో ఏఐఎ్‌సఎఫ్‌ ఆవిర్భవించిందని అన్నారు. ప్రభుత్వ వి ద్య పరిరక్షణ, శా స్ర్తీయ విద్య, కామన విద్యావిధానం అమలు కోసం ఏఐఎ్‌సఎ ఫ్‌ నిరంతం పోరాటాలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఐఎ్‌సఎఫ్‌ డివిజన ఆ ర్గనైజింగ్‌ కార్యదర్శి షేక్‌ శంషుద్దీన, మండల అధ్యక్షుడు నల్లగాసు సైదులు, నా యకులు శివ, నేనావత అజయ్‌, కపిల్‌, స్వామి, రమేష్‌, మహేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-13T05:56:37+05:30 IST