కానిస్టేబుల్ భార్య అనూహ్య నిర్ణయం.. పిల్లల్ని బయటకు పంపించి.. పక్కింటి వారు చెప్పింది విని భర్తకు భారీ షాక్..!

ABN , First Publish Date - 2021-09-05T23:30:58+05:30 IST

కానిస్టేబుల్ భార్య అనూహ్య నిర్ణయం.. పిల్లల్ని బయటకు పంపించి..

కానిస్టేబుల్ భార్య అనూహ్య నిర్ణయం.. పిల్లల్ని బయటకు పంపించి..  పక్కింటి వారు చెప్పింది విని భర్తకు భారీ షాక్..!

ఇంటర్నెట్ డెస్క్:  ఎప్పటిలాగే ఆ కానిస్టేబుల్ మధ్యాహ్నం భోజనం చేసేందకు ఇంటికొచ్చారు. భార్య పెట్టింది తిని మళ్లీ తన పనిమీదు వెళ్లిపోయారు. అయితే..మరి కొద్ది గంటల్లో తన జీవితం ఊహించని మలుపు తిరుగుతుందని ఆయనకు అప్పుడు తెలియదు. ఇక.. సాయంత్రం ఏడు గంటల సమయంలో ఆయన విధుల్లో ఉండగా.. ఓ షాకింగ్ ఫోన్ కాల్ వచ్చింది. ‘‘మీ భార్య ఆత్మహత్య చేసుకున్నారు’’ అంటూ పక్కింటి వారు సమాచారం అందించారు. వెంటనే ఆయన పరుగుపరుగున ఇంటికి వచ్చి చూడగా.. భార్య మృతదేహం ఫ్యాను నుంచి వేళాడుతూ కనిపించింది. ఉత్తరప్రదేశ్‌ సంభల్ జిల్లాల్లో శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.


బిజ్నోర్ జిల్లాకు చెందిన జరీనుద్దీన్.. సంభల్‌లోని  నార్కోటిక్స్ విభాగం కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన భార్య పేరు ఫర్హానా. వారికి ఇద్దరు ఆడపిల్లలు. కాగా..  శనివారం మధ్యాహ్నం జరీనుద్దీన్ భోజనానికని ఇంటికి వచ్చారు. అన్నం తిన్నాక మళ్లీ తన పనిమీద వెళ్లిపోయారు. అయితే..సాయంత్రం సుమారు ఏడు గంటల సమయంలో తనకు ఓ షాకింగ్ ఫోన్ కాల్ వచ్చింది. మీ భార్య ఆత్మహత్య చేసుకున్నారంటూ పక్కింటి వారు చెప్పడంతో ఆయన ఒక్కసారిగా షాకయ్యారు. పరుగుపరుగున ఇంటికి వెళ్లి చూడగా..భార్య మృత దేహం ఫ్యానుకు వెళ్లాడుతూ కనిపించడంతో ఆయన కన్నీరుమున్నీరయ్యారు.  


సరుకుల కోసం తన ఇద్దరు పిల్లల్ని బయటకు పంపించాక..ఆమె  ఆత్మహత్యకు పాల్పడిందని పనిమనిషి పోలీసులకు తెలిపింది. తలుపు తీయమని కోరినా ఎటువంటి స్పందనా లేకపోవడంతో..తాను కిటీకీలోంచి తొంగి చూడగా.. ఆమె ఫ్యాన్‌నుంచి వేళాడుతూ చలనం లేకుండా కనిపించినట్టు పేర్కొంది. ఈ విషయాన్ని ఆమె పక్కింటి వారికి సమాచారం ఇవ్వగా.. వారు పోలీసులతో పాటు మృతురాలి భర్తకు కూడా సమాచారం అందించారు. కాగా.. గత కొంత కాలం కానిస్టేబుల్ భార్య అనారోగ్యంతో బాధపడుతున్నట్టు చుట్టుపక్కల వారు పోలీసులకు తెలిపారు. ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నా ఆశించిన ఫలితం లేకపోవడంతో ఆమె తీవ్ర డిప్రెషన్‌లో కూరుకుపోయిందని పేర్కొన్నారు.

Updated Date - 2021-09-05T23:30:58+05:30 IST