కోతుల ఆకలి తీర్చిన కానిస్టేబుళ్లు

ABN , First Publish Date - 2020-04-03T06:52:20+05:30 IST

యాదాద్రి కొండపై వానరాలకూ లాక్‌డౌన్‌ తిప్పలు తప్పలేదు. యాదాద్రి ఆలయం మూతబడడంతో భక్తుల రాక నిలిచిపోయింది. దీంతో...

కోతుల ఆకలి తీర్చిన కానిస్టేబుళ్లు

యాదాద్రి, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): యాదాద్రి కొండపై వానరాలకూ లాక్‌డౌన్‌ తిప్పలు తప్పలేదు. యాదాద్రి ఆలయం మూతబడడంతో భక్తుల రాక నిలిచిపోయింది. దీంతో ఆహారం కోసం అలమటిస్తున్న వానరాలను చూసి చలించిపోయిన ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లు హరీశ్‌రాజ్‌, ప్రవీణ్‌.. ఒక అరటిగెల, 25కిలోల టమాటాలను వాటికి అందజేశారు.

Updated Date - 2020-04-03T06:52:20+05:30 IST