కానిస్టేబుల్‌ భార్య, హోంగార్డు ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-04-13T12:13:13+05:30 IST

రెండు పోలీస్‌ కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది.

కానిస్టేబుల్‌ భార్య, హోంగార్డు ఆత్మహత్య

హైదరాబాద్/నార్సింగ్‌ : రెండు పోలీస్‌ కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. రెండు వేర్వేరు ఘటనలో గ్రీహౌన్స్‌ కానిస్టేబుల్‌ భార్య, మరో హోంగార్డు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంచిరేవుల గ్రేహౌండ్స్‌ కాంప్లెక్స్‌లో పనిచేసే కానిస్టేబుల్‌ కృష్ణ ప్రసాద్‌, మంచిరేవుల గ్రామంలో అద్దెకుంటున్నాడు. ఇతనికి ప్రశాంతి (35)తో 2012లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. సోమవారం సాయంత్రం ప్రశాంతి తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పక్కనే ఉన్న స్థానికులు గమనించి ఆమె భర్తకు, నార్సింగ్‌ పోలీసులకు సమాచారం అందించారు. ప్రశాంతి సోదరుడు జి ప్రవీణ్‌ నార్సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


మరో ఘటనలో హోంగార్డు ..

టప్పాఛబుత్ర పోలీ‌స్‌స్టేషన్‌లో పనిచేసే హోం గార్డు నార్సింగ్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నార్సింగ్‌ గ్రామంలో నివాసం ఉండే రాజేంద్రప్రసాద్‌(41) (హెచ్‌జీ 8240) టప్పాఛబుత్ర పోలీ‌స్‌స్టేషన్‌లో హోంగార్డు. సోమవారం  ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని నార్సింగ్‌ పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-04-13T12:13:13+05:30 IST