దూబేతో జీపులో ప్రయాణించిన కానిస్టేబుల్‌కు కరోనా!

ABN , First Publish Date - 2020-07-12T22:43:37+05:30 IST

గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను ఉజ్జయిన్ నుంచి యూపీకి తరలించబోయిన జీపులో ప్రయాణించిన ఓ కానిస్టేబుల్‌ కరోనా పాజిటివ్‌గా తేలాడు.

దూబేతో జీపులో ప్రయాణించిన కానిస్టేబుల్‌కు కరోనా!

ఉత్తరప్రదేశ్: గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను ఉజ్జయిన్ నుంచి యూపీకి తరలించబోయిన జీపులో ప్రయాణించిన ఓ కానిస్టేబుల్‌ కరోనా పాజిటివ్‌గా తేలాడు. దీనికి సంబంధించిన రిపోర్టు శనివారం రాత్రి వచ్చినట్లు యూపీ పోలీసు శాఖ అధికారులు వెల్లడించారు. సదరు కానిస్టేబుల్‌ను ఐసోలేషన్ వార్డుకు తరలించినట్లు తెలుస్తోంది.  దీనికి సంబంధించిన వివరాలను కాన్పూర్‌లోని ఎల్‌ఎల్ఆర్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ కమల్ ధ్రువీకరించారు. దూబేని యూపీకి తరలించబోయిన వాహనంలో సదరు కానిస్టేబుల్‌తోపాటు ఉన్న మరో నలుగురికి కరోనా టెస్టులు నిర్వహించారు. వీరందరికీ నెగిటివ్ ఫలితం వచ్చినట్లు సమాచారం. యూపీకి వస్తుండగా ఈ వాహనానికి యాక్సిడెంట్ అయింది. ఆ సమయంలో తన చేతికి లభించిన తుపాకీ తీసుకొని దూబే పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతన్ని ఎన్‌కౌంటర్ చేసినట్లు సమాచారం.

Updated Date - 2020-07-12T22:43:37+05:30 IST