సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కానిస్టేబుల్ సంతోష్ ఆవేదన

ABN , First Publish Date - 2021-06-19T01:10:29+05:30 IST

సస్పెన్షన్‌కు గురైన బిచ్కుంద కానిస్టేబుల్ సంతోష్ ఆవేదన సోషల్ మీడియాలో వైరల్‌గా

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కానిస్టేబుల్ సంతోష్ ఆవేదన

కామారెడ్డి: సస్పెన్షన్‌కు గురైన బిచ్కుంద కానిస్టేబుల్ సంతోష్ ఆవేదన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాను తప్పు చేయకున్నా ఎస్‌ఐ నివేదిక ఇవ్వడం వల్లే ఉన్నతాధికారులు తనను సస్పెన్షన్ చేశారని జుక్కల్ వైసీపీ నాయకుడితో ఫోన్‌లో తన గోడును కానిస్టేబుల్ సంతోష్ వెల్లడించాడు. నెలకు లక్షల ముడుపులు తీసుకుంటున్నా ఎస్‌ఐపై చర్యలు లేవని, తాము తప్పు చేయకున్నా శిక్షించారని ఆవేదన వ్యక్తం చేశాడు. 


 ఇసుక క్వారీల నుంచి ఇసుకను తరలించే లారీల వద్ద బిచ్కుంద పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సంతోష్‌, పరంధామయ్య, భవిత, మైస కళ డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారు. దీంతో వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ ఎస్పీ శ్వేతారెడ్డి సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-06-19T01:10:29+05:30 IST