రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ మృతి

ABN , First Publish Date - 2021-04-13T05:33:16+05:30 IST

విధి నిర్వహణలో భాగంగా కడప డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి వస్తుండగా కలమల్ల పోలీసుస్టేషనలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బొమ్మనబోయిన యశ్వంతకుమార్‌ (32) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల్లోకెళితే....

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ మృతి
101వైజియల్‌12: మృతి చెందిన కానిస్టేబుల్‌ యశ్వంతకుమార్‌

కలమల్ల పోలీసుస్టేషనలో విషాదం

ఎర్రగుంట్ల, ఏప్రిల్‌ 12: విధి నిర్వహణలో భాగంగా కడప డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి వస్తుండగా కలమల్ల పోలీసుస్టేషనలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న  బొమ్మనబోయిన యశ్వంతకుమార్‌ (32) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల్లోకెళితే.... 2013 బ్యాచకు చెందిన కానిస్టేబుల్‌ యశ్వంతకుమార్‌ రెండేళ్లుగా కలమల్ల పోలీసుస్టేషనలో విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం ఉదయం కడప డీఎస్పీ కార్యాలయానికి తపాలా ఇచ్చేందుకు మోటార్‌బైక్‌లో వెళ్లాడు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు గ్రామ శివార్లలో వెనుకవైపు నుంచి వచ్చిన ఏపీ04 టీడబ్ల్యు 6656 నెంబరు గల ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొంది. బస్సు ముందుభాగం కుడివైపు టైరు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సీఐలు సదాశివయ్య, ఉలసయ్య, ఎస్‌ఐ చంద్రమోహన సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. యశ్వంతకు భార్య, రెండేళ్ల వయసు గల కుమార్తె, సంవత్సరం వయసు గల కుమారుడు ఉన్నారు. నాలుగు రోజుల క్రితమే కుమారుడి జన్మదిన వేడుకలు కూడా జరుపుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అతడి మృతితో కలమల్ల పోలీసుస్టేషనలో విషాదం నెలకొంది. తోటి సిబ్బంది, ఇతర అధికారులు సంతాపం తెలిపారు. 

Updated Date - 2021-04-13T05:33:16+05:30 IST