కర్ణాటక మద్యం నిల్వ కేసులో కానిస్టేబుల్‌ అరెస్టు

ABN , First Publish Date - 2021-01-16T06:57:07+05:30 IST

కర్ణాటక మద్యాన్ని కారులో అక్రమంగా నిల్వ ఉంచిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ను ఎస్‌ఈబీ (స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో) పోలీసులు అరెస్టు చేశారు.

కర్ణాటక మద్యం నిల్వ కేసులో కానిస్టేబుల్‌ అరెస్టు
కారులో నిల్వ ఉంచిన కర్ణాటక మద్యం

చిత్తూరు సిటీ, జనవరి 15: కర్ణాటక మద్యాన్ని కారులో అక్రమంగా నిల్వ ఉంచిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ను ఎస్‌ఈబీ (స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో) పోలీసులు అరెస్టు చేశారు. సీఐ పురుషోత్తం తెలిపిన వివరాల మేరకు.. రహస్య సమాచారంతో గురువారం నగరంలోని మిట్టూరు ప్రాంతంలోని రాగిమానువీధిలోని కారును తనిఖీ చేశారు. అందులో 240 కర్ణాటక మద్యం బాటిళ్లు (180 ఎంఎల్‌ టెట్రా) గుర్తించారు. విచారణలో చిత్తూరు ఏఆర్‌ (ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌) కానిస్టేబుల్‌ భాస్కర్‌రెడ్డి ఈ అక్రమ నిల్వ చేసినట్లు తెలిసింది. దాంతో నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని సీఐ పేర్కొన్నారు.

Updated Date - 2021-01-16T06:57:07+05:30 IST