దళితులు, గిరిజనులకు ఉపాధి పనులు రద్దు చేసే కుట్ర
ABN , First Publish Date - 2021-06-22T05:41:39+05:30 IST
రానున్న రోజుల్లో దళితులు, గిరిజనులకు ఉపాధి హామీ పనులను రద్దు చేసే కుట్రకు కేంద్ర ప్రభుత్వం పథకం ప్రకారం చర్యలు చేపడుతున్నదని ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స విమర్శించారు.
గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనర్స
పాడేరు, జూన్ 21: రానున్న రోజుల్లో దళితులు, గిరిజనులకు ఉపాధి హామీ పనులను రద్దు చేసే కుట్రకు కేంద్ర ప్రభుత్వం పథకం ప్రకారం చర్యలు చేపడుతున్నదని ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స విమర్శించారు. ఉపాధి పనుల్లో కుల విభజనకు నిరసనగా చింతలవీధిలో ఉపాధి కూలీలతో కలిసి సోమవారం నిరసన చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం దళితులు, గిరిజనులను ఉపాధి పనులకు దూరం చేయాలని లక్ష్యంతోనే కుల విభజనకు చేయాలని భావిస్తున్నారన్నారు. అందరికీ ఒకేలా ఉపాధి పనులు కల్పించాలని, కొవిడ్ నేపథ్యంలో ప్రతీ కుటుంబానికి రూ.10 వేలు, 18 రకాల నిత్యావసర సరకులు ఉచితంగా అందించాలని అప్పలనర్స డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో సీపీఎం నేత ఎల్.సుందరరావు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.