స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లు పరిశీలన

ABN , First Publish Date - 2022-08-13T04:28:38+05:30 IST

స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా అధికారులను ఆదేశించారు.

స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లు పరిశీలన
పోలీస్‌ పేరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్లు

రాయచోటి(కలెక్టరేట్‌), ఆగస్టు 12: స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు  అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో వేడుకలకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లను జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేస్తున్న వేధిక, శాఖల ప్రగతిని చూపే శకటాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ముఖ్యంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూర్చునేందుకు వీలుగా వేధికను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌వో సత్యనారాయణ, రాయచోటి ఆర్డీవో రంగస్వామి, రాయచోటి మున్సిపల్‌ కమిషనర్‌ రాంబాబు, జిల్లా పోలీసు, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



 

Updated Date - 2022-08-13T04:28:38+05:30 IST