తుపాకీతో కాల్చుకుని సాయుధ దళం పోలీసు ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-05-08T15:31:28+05:30 IST

నగరంలో భద్రతా విధుల్లో పాల్గొన్న సాయుధదళ పోలీసు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శివగంగ జిల్లా శంకర్‌కోయిల్‌ ప్రాంతానికి చెందిన శరవణకుమార్‌ (30) రాష్ట్ర

తుపాకీతో కాల్చుకుని సాయుధ దళం పోలీసు ఆత్మహత్య

పెరంబూర్‌(చెన్నై): నగరంలో భద్రతా విధుల్లో పాల్గొన్న సాయుధదళ పోలీసు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శివగంగ జిల్లా శంకర్‌కోయిల్‌ ప్రాంతానికి చెందిన శరవణకుమార్‌ (30) రాష్ట్ర సాయుధ దళంలో 2013లో చేరాడు. ఆయనకు శ్వేతతో ఆరు నెలల క్రితం వివాహం కాగా, ప్రస్తుతం ఆవడిలోని పూమోళిల్‌ నగర్‌లో నివాసం ఉంటున్నారు. శరవణకుమార్‌కు అంబత్తూర్‌లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో విధులు కేటాయించారు. ఈ నేపథ్యంలో, శనివారం సాయంత్రం శరవణకుమార్‌ తన చేతిలోని తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.అంబత్తూర్‌ పోలీసు సహాయ కమిషనర్‌ మహేష్‌, డిప్యూటీ కమిషనర్‌ కనకరాజ్‌, ఇన్‌స్పెక్టర్లు రామస్వామి, కృష్ణమూర్తి సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శరవణకుమార్‌ ఆన్‌లైన్‌ రమ్మీకి అలవాటు భారీగా నగదు పోగొట్టుకున్నాడని, ఆ కారణంగా మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది.

Read more