భారత్లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి!
ABN , First Publish Date - 2022-01-14T14:59:06+05:30 IST
అగ్రరాజ్యం అమెరికా చట్టసభ(కాంగ్రెస్) కమిటీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్లో తదుపరి అమెరికా రాయబారిగా ఎరిక్ ఎం గార్సెట్టి నియామకానికి ఆమోద ముద్ర వేసింది. అ
ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికా చట్టసభ(కాంగ్రెస్) కమిటీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్లో తదుపరి అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి నియామకానికి ఆమోద ముద్ర వేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. గతేడాది జులైలో ఎరిక్ గార్సెట్టిని భారత్లో అమెరికా రాయబారిగా పని చేసేందుకు నామినేట్ చేశారు. తాజాగా ఆయన నియామకానికి కాంగ్రెస్ ఆమోదం లభించింది. సెనేట్ కూడా ఆమోదం తెలిపితే.. భారత్లో అదుపరి అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి నియామకం పూర్తవుతుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఆయన లాస్ ఏంజెల్స్ మేయర్గా పని చేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో బైడెన్ ఎన్నికల ప్రచారం బృందంలో కీలకంగా వ్యవహరించారు.