తెల్ల రేషన్కార్డు లేని పేదలను గుర్తించాలి: ఉత్తమ్
ABN , First Publish Date - 2020-03-27T02:30:58+05:30 IST
తెల్ల రేషన్కార్డు లేని పేదలను గుర్తించాలి: ఉత్తమ్
హైదరాబాద్: కరోనా రూపంలో ప్రపంచం ఒక విపత్తును ఎదుర్కొంటోందని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మానవ జాతినే ఒక ఆందోళనకర పరిస్థితిలోకి నెట్టేసిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నిబంధనలు..ప్రతి ఒక్కరు పాటించాలని సూచించారు. కాంగ్రెస్ కార్యకర్తలు పేద ప్రజలకు సహాయం అందించాలి..తెల్ల రేషన్కార్డు లేని పేదలను కూడా గుర్తించి..ప్రభుత్వం సాయం అందించాలన్నారు.