వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్దే అధికారం: ఉత్తమ్
ABN , First Publish Date - 2022-01-17T00:52:12+05:30 IST
శాండ్, లాండ్, మైన్స్, వైన్స్ల పేరిట దోచుకుందాం.. దాచుకుందాం అనే విధంగా టీఆర్ఎస్ పాలన ఉందని ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు.
నల్లగొండ: శాండ్, లాండ్, మైన్స్, వైన్స్ల పేరిట దోచుకుందాం.. దాచుకుందాం అనే విధంగా టీఆర్ఎస్ పాలన ఉందని ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంబరాలు నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రాష్ట్రాభివృద్ధి కంటే స్వలాభం కోసమే టీఆర్ఎస్ నాయకులు పని చేస్తున్నారని, అధికారంలో ఉన్నామనే ధీమాతో అక్రమ వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. 135 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ ఒక్క రైతూ నష్టపోలేదన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులు గల్లీగల్లీలో అవినితీ చేస్తున్నారన్నారు. పోలీసులు టీఆర్ఎస్ నాయకులకు అనుకూలంగా వ్యవహరించడం విచారకరమన్నారు. రైతులు యాసంగిలో వరి సాగు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ధాన్యం కొనుగోలుచేయదో చూద్దామన్నారు. అన్ని రాష్ట్రాల్లో పంట బీమా అమలవుతుంటే తెలంగాణాలో ఎందుకు అమలుచేయడంలేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే అధికారమని ఉత్తమ్కుమార్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.