తృణమూల్ MP అభిషేక్ బెనర్జీపై కేంద్రం నిఘా పెట్టింది : congress ట్వీట్

ABN , First Publish Date - 2021-07-25T20:35:17+05:30 IST

పెగాసస్ స్పైవేర్ ఆధారంగా కాంగ్రెస్ మరోమారు కేంద్ర ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా ఆరోపణలు గుప్పించింది. తృణమూల్ కీలక నేత,

తృణమూల్ MP అభిషేక్ బెనర్జీపై కేంద్రం నిఘా పెట్టింది : congress ట్వీట్

న్యూఢిల్లీ :  పెగాసస్ స్పైవేర్ ఆధారంగా కాంగ్రెస్ మరోమారు కేంద్ర ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా ఆరోపణలు గుప్పించింది. తృణమూల్ కీలక నేత, ఎంపీ అభిషేక్ బెనర్జీపై కేంద్రం పెగాసస్ ద్వారా నిఘా పెట్టిందని ఆరోపించింది. ‘‘మీరు కాల క్రమాన్ని అర్థం చేసుకోండి. పెగాసస్ లక్ష్యం ఎవరు? మమతా బెనర్జీ, ఆమె అల్లుడు అభిషేక్ బెర్జీ. ఎప్పుడు? 2021 లో. ఎందుకు? బెంగాల్‌లో ఎన్నికలున్నాయి. ఆ సమయంలో మోదీ ప్రభుత్వం విపరీతంగా భయం పెట్టుకుంది. మీ శత్రువులకు దగ్గరగా మెదలండి అన్న సామెతను కేంద్రం సీరియస్‌గా తీసుకుంది’’ అంటూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. 

Updated Date - 2021-07-25T20:35:17+05:30 IST