గాంధీభవన్కు వరంగల్ కాంగ్రెస్ పంచాయితీ
ABN , First Publish Date - 2022-02-13T23:38:55+05:30 IST
గాంధీభవన్కు వరంగల్ కాంగ్రెస్ పంచాయితీ
హైదరాబాద్: వరంగల్ కాంగ్రెస్ పంచాయితీ గాంధీభవన్కు చేరింది. వరంగల్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి నేతృత్వంలో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, ఇంచార్జి మానిక్కం ఠాగూర్ను పలువురు కాంగ్రెస్ నేతలు కలిశారు. జనగామ డీసీసీ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డిపై ఫిర్యాదు చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం టిఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్తో కలిసి పనిచేయడం పై అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్కు కోవర్ట్గా పనిచేస్తున్నారని నాయిని వర్గం ఆరోపించింది. అలాగే జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా వరంగల్ నియోజక వర్గంలో జోక్యం చేసుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరు నియోజక వర్గాల్లో పార్టీని ఇబ్బంది పెడుతున్నారని కూడా ఫిర్యాదు చేశారు. జంగాపై కట్టడి చర్యలు తీసుకోవాలని నాయిని రాజేందర్ రెడ్డి కోరారు.