నేడు కాంగ్రెస్ శాసనసభా పక్షం అత్యవసర భేటీ
ABN , First Publish Date - 2022-01-09T14:08:24+05:30 IST
నేడు కాంగ్రెస్ శాసనసభా పక్షం అత్యవసర భేటీ
హైదరాబాద్: నేడు కాంగ్రెస్ శాసనసభా పక్షం అత్యవసర భేటీ కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు సీఎల్పీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ భేటీలో తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. అలాగే వనమా రాఘవ అరాచకాలు.. పార్టీ పరంగా చేపట్టాల్సిన చర్యలపై కూడా చర్చించనున్నారు.