‘బీసీలు ఐక్యంగా ఉంటే గెలుపు మాదే’
ABN , First Publish Date - 2022-08-09T00:47:39+05:30 IST
‘బీసీలు ఐక్యంగా ఉంటే గెలుపు మాదే’
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది బీసీలకు పీసీసీ పదవి ఇచ్చిందని కాంగ్రెస్ నేత మహేష్కుమార్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పీసీసీ,డీసీసీ కమిటీలలో బీసీలకు తగిన ప్రాధాన్యత ఉంటుందన్నారు. బీసీ జనభా ఎక్కువ ఉన్నప్పటికీ బీసీ లను ఎన్నికల్లో గెలిపించుకోలేకపోతున్నామని చెప్పారు. బీసీలు ఐక్యంగా ఉంటే గెలుపు తమదేనన్నారు.అవకాశాన్ని బీసీలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. బీసీలకు మోడీ, కేసీఆర్ ఓరగబెట్టింది ఏమీ లేదన్నారు. బీసీలంతా మునుగోడు సీటు ను గెలిపించి కాంగ్రెస్కు బహుమతి గా ఇవ్వాలన్నారు. పీసీసీ, డీసీసీ కమిటీల్లో బీసీలకు ప్రాధాన్యమన్నారు.