కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలి
ABN , First Publish Date - 2020-06-29T11:42:13+05:30 IST
ఎన్డీఏ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని పీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్
ఏలూరు కార్పొరేషన్, జూన్ 28 : ఎన్డీఏ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని పీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్ పిలుపునిచ్చారు. శని, ఆదివారాల్లో వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లాలోని కాంగ్రెస్ ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతుంటే పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడం, విద్యుత్ చార్జీలపై ప్రజల్లోకి వెళ్లాలన్నారు. జెట్టి గురునాధరావు, రాజనాల రామ్మో హన రావు, పెద్దిరెడ్డి సుబ్బారావులు చేస్తున్న కార్యక్రమాల పట్ల అభినందించారు.