రాజస్థాన్లో మూడింట రెండు చోట్ల కాంగ్రెస్ గెలుపు
ABN , First Publish Date - 2021-05-03T03:08:43+05:30 IST
రాజస్థాన్లో మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ రెండుచోట్ల విజయం సాధించింది....
జైపూర్: రాజస్థాన్లో మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ రెండుచోట్ల విజయం సాధించింది. మరోచోట బీజేపీ నెగ్గింది. సుజన్గఢ్, సహదా అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగా.. రాజ్సమంద్ను బీజేపీ తిరిగి నిలబెట్టుకుంది. ఈ మూడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అనారోగ్యంతో మృతి చెందడంతో ఉపఎన్నికలు జరిగాయి. సహదాలో దివంగత ఎమ్మెల్యే కైలాష్ త్రివేది సతీమణి గాయత్రి త్రివేదిని బరిలో నిలిపిన కాంగ్రెస్ పార్టీ... సుజన్గఢ్లో దివంగత ఎమ్మెల్యే భన్వర్లాల్ మేఘావాల్ కుమారుడు మనోజ్ మేఘావాల్ను నిలబెట్టింది. మరోవైపు బీజేపీ సైతం రాజ్సమంద్ నుంచి ఆ పార్టీ దివంగత ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి కుమార్తెకు టికెట్ ఇచ్చింది. సుజన్గఢ్లో మనోజ్ మేఘావాల్కు 79,253 ఓట్లు రాగా.. ఆయన సమీప ప్రత్యర్థి ఖేమారామ్కు 43,642 ఓట్లు వచ్చాయి. రాజ్సమంద్లో దీప్తి మహేశ్వరి కాంగ్రెస్ అభ్యర్థి తన్సుక్ బొహరా 5,310 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక సహదాలో గాయిత్రి దేవి తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి రతన్లాల్ జాట్పై 42,200 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.