వంతెన నిర్మాణంలో జాప్యంపై కాంగ్రెస్ శ్రేణుల నిరసన
ABN , First Publish Date - 2022-07-04T05:59:32+05:30 IST
మండలంలోని తక్కళ్ళపల్లి - సిరికొండ గ్రా మాల మధ్య నిర్మిస్తున్న వంతెన పనులు ఎనిమిదేళ్ళుగా పెండింగ్లో ఉం టున్న వైనంను నిరసిస్తూ ఆదివారం కాంగ్రెస్ నాయకులు నిరసన వెలి బుచ్చారు.
కథలాపూర్, జూలై 3 : మండలంలోని తక్కళ్ళపల్లి - సిరికొండ గ్రా మాల మధ్య నిర్మిస్తున్న వంతెన పనులు ఎనిమిదేళ్ళుగా పెండింగ్లో ఉం టున్న వైనంను నిరసిస్తూ ఆదివారం కాంగ్రెస్ నాయకులు నిరసన వెలి బుచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం టెండర్లు పిలిచి కాంట్రాక్టర్కు అప్పగిం చినప్పటికీ పనులు పూర్తి చేయించడంలో విఫలమయినట్టు ఆరోపిం చా రు. పాలకుల నిర్లక్ష్యం వల్ల తక్కళ్ళపల్లి వాసులు మండల కేంద్రంకు చేరు కోవాలంటే వానా కాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. స్థానిక అధికార పార్టీ నేతలు గొప్పలు చెప్పుకుంటూ కాలయాపన చేస్తు న్నారే తప్ప పనులు పూర్తి చేయించడంపై దృష్టి సారించడం లేదని వి మర్శించారు. వంతెన నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం అందించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రమేశ్బాబు, ఎంపీ సంజయ్కుమార్లకు వ్యతిరేకంగా నినాదా లు చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కాయతి నాగరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ అజీం, అలకొండ లింగంగౌడ్, పులి శిరీష, కల్లెడ గంగాధర్, పులి శిరీష, ఆకుల సంతోష్, శంకర్, సంజీవ్, ప్రేమ్కుమార్, సంజీవ్, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.