అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సత్యాగ్రహం

ABN , First Publish Date - 2022-06-28T03:31:47+05:30 IST

రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ను నిరసిస్తూ సోమవారం మండల కాంగ్రెస్‌ పార్టీ ర్యాలీ, అనంతరం సత్యాగ్రహం నిర్వహించింది.

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సత్యాగ్రహం
ర్యాలీ నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

ఇందుకూరుపేట, జూన్‌ 27 : రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ను నిరసిస్తూ సోమవారం మండల కాంగ్రెస్‌ పార్టీ ర్యాలీ, అనంతరం సత్యాగ్రహం నిర్వహించింది. మండల నాయకులు గునపాటి ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో బజారువీధిలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాయకులు కార్యకర్తలతో కలిసి పార్టీ కార్యాలయం ఇందుకూరుపేట ఇందిరమ్మ భవన్‌లో సత్యాగ్రహం చేశారు. అనంతరం ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ యువతలో జాతీయ భావాలు పెంపొంది, దేశానికి మార్గదర్శకత్వ బాధ్యతలు అప్పగించాల్సి ఉండగా బీజేపీ రాజకీయాలు చేయడం దారుణమన్నారు. వెన్నెముక అయిన జాతీయవాదాన్ని నీరు కారుస్తున్న బీజేపీ ప్రభుత్వం మూల్యం చెల్లించకతప్పదని, అప్పటి వరకు కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమిస్తుందన్నారు. అధిక సంఖ్యలు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-28T03:31:47+05:30 IST